టిడిపి, ఏలూరిపై కొత్తపాట ఆవిష్కరణ

Jan 1,2024 23:58

ప్రజాశక్తి – పర్చూరు
స్థానిక టిడిపి కార్యాలయంలో టిడిపి బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కొత్త పాటను సోమవారం ఆవిష్కరించారు. నియోజకవర్గంలో ఆయన చేసిన పాదయాత్ర, అభివృద్ధి తీరుతెన్నులను వివరిస్తూ ప్రముఖ గాయకుడు నల్గొండ గద్దర్ ఆలపించిన పాటను ఆస్వాదించారు. టిడిపి కార్యకర్తలు, నాయకులు, అభిమానుల మధ్య ఈ పాట ఆవిష్కరించిన వేడుకను ఘనంగా నిర్వహించారు. అభివృద్ది చేసిన ఏలూరిని మరోసారి గెలిపించాలని నాయకులు కోరారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు షేక్ శంషుద్దీన్, యద్దనపూడి అధ్యక్షులు రంగయ్య చౌదరి, మానం హరిబాబు, కోడూరి బ్రహ్మచారి, మక్కెన శేఖర్ బాబు, అగ్నిగుండాల కృష్ణ, సునీత, కొల్లా శ్రీరామ్ ప్రసాద్, మల్లాది సురేష్, కొడగంటి శివ, గోరంట్ల రామకృష్ణ, అప్పలనేని వెంకట్, చెరుకూరి చెంపయ్య, కనుగంటి సాంబయ్య, లక్ష్మి, శ్రీహరి, సతీషు, రమణ, గద్దె చిన్న, షేక్ హుస్సేన్, మామిడిపాక హరి, దాసి కిరణ్, లక్కి పోగు సుమన్, గద్దె మోజేష్, సమీరు, గౌస్, షేక్ బషీర్, గౌస్ బాషా, ఖాజావలి, తమ్ములూరి శివ, వేణు, రావి శీను,కె జీవన్ పాల్గొన్నారు.

➡️