టిడిపి పథకాల కరపత్రాలు పంపిణీ

Apr 5,2024 00:55 ##ntr #tdp

ప్రజాశక్తి – సంతమాగులూరు
సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జీవితమంతా బూటకపు రాజకీయాలు, శవ రాజకీయాలు, బూటకపు ప్రచారాలే తప్ప మరోటి లేదని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ ఆరోపించారు. మండలంలోని కొప్పరం ముస్లిం కాలనీలో గురువారం పర్యటించారు. ఇంటింటికి తిరిగి టిడిపి సూపర్ సిక్స్ పథకాల పట్ల ప్రజలకు, వికలాంగులకు అవగాహన కల్పించారు. ఏప్రిల్ 1 దాటి ఐదు రోజులైందని అన్నారు. కానీ ప్రభుత్వం దగ్గర నిధులు లేక పింఛన్లు పూర్తిస్థాయిలో ఇవ్వలేదని అన్నారు. ఉద్యోగులకు నేటికీ జీతాలు లేవన్నారు. పింఛన్లు అందక వృద్ధులు సచివాలయాల వద్ద పడిగాపులు కాసి మృతి చెందుతున్నారని అన్నారు. జగన్‌రెడ్డి వృద్ధులను చంపి శవ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఈ పాపం వైసిపిని వెంటాడి భూస్థాపితం చేయడం ఖాయం అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి తిరిగి రూ.4వేల పింఛన్ ఇచ్చే బాధ్యత టిడిపి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ షేక్ మస్తాన్‌వలి (బోడె), షేక్ ముల్లా సుభాని, ముజాఫర్ కాలే, షేక్ ఇబ్రహీం, నెంబర్ మౌలాలి, ధూపాటి ఏసోబు, తేలప్రోలు రమేష్, చేవూరి వాసురెడ్డి, కొనికి గోవిందమ్మ, గుమ్మా జ్యోతి, సుజాత పాల్గొన్నారు.

➡️