టిడిపి ఎమ్మెల్యే స్వామికి మాతృ వియోగం

Mar 24,2024 12:20 #Prakasam District

ప్రజాశక్తి-ప్రకాశం జిల్లా : కొండేపి టిడిపి ఎమ్మెల్యే స్వామికి మాతృ వియోగం చెందారు. గత కొన్నిరోజులుగా ఎమ్మెల్యే తల్లి డోలా సుబ్బమ్మ అనారోగ్య బారిన పడి వైద్యం  పొందుతున్నారు. శనివారం రాత్రి 8గంటల సమయంలో స్వామి స్వగ్రామం టంగుటూరు మండలం తూర్పు నాయడు పాలెంలో తుదిస్వాస విడిచారు. ఎమ్మెల్యే తల్లి మృతిపై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్, హిందుపూరు ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ  ఫోన్లో  పరామర్శించారు. ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం 4గంటలకు ఎమ్మెల్యే స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని టిడిపి నాయకులు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు అంత్యక్రియలకు హాజరు కానున్నారు.

➡️