- చివరి మ్యాచ్లో ఐర్లాండ్పై 57పరుగుల తేడాతో గెలుపు
షార్జా: ఐర్లాండ్తో జరిగిన మూడో, చివరి టి20లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 57పరుగుల తేడాతో నెగ్గి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. షార్జా క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన తొలిగా బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 156పరుగులు చేసింది. జడ్రాన్(72నాటౌట్), మహ్మద్(27) టాప్ స్కోరర్స్. ఐర్లాండ్ బౌలర్లు అడైర్, లిట్టిల్, కార్ట్లీ, ఛాప్టర్, డెలే, వైట్లకు ఒక్కో వికెట్ దక్కాయి. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐర్లాండ్ జట్టు 17.2ఓవర్లలో 98పరుగులకే ఆలౌటైంది. ఆఫ్ఘన్ బౌలర్లు ఒమర్జారుకు నాలుగు, నవీన్-ఉల్-హక్కు మూడు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జడ్రాన్కు సిరీస్ రషీద్ ఖాన్కు దక్కాయి. తొలి టి20లో ఐర్లాండ్ జట్టు 38పరుగుల తేడాతో నెగ్గితే, రెండో టి20లో ఆఫ్ఘన్ జట్టు 10పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.