కాకినాడలో టీ20 క్రికెట్

Dec 10,2023 14:30 #Kakinada

ప్రజాశక్తి-కాకినాడ :ఈనెల 16, 17 తేదీల్లో కాకినాడలో ఉన్న ఆర్ఎంసి క్రీడా ప్రాంగణంలో యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో టీ20 క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి సురేష్ తెలిపారు. ఆదివారం కాకినాడ అశోక్ నగర్ లో ఉన్న ఎమ్మెస్ఎన్ పాఠశాలలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఆరు నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు ఇతర వివరాల కొరకు తమ పాఠశాలలోని ప్రధానొపాధ్యాయులకు వారి యొక్క వివరాలు సమర్పించాలని తెలియజేశారు. విద్యార్థులను క్రీడల వైపు మళ్లించేందుకు తాము ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఇదయతుల్లా, యూపీఈఐఎఫ్ కాకినాడ సిటీ ప్రధాన కార్యదర్శి రమణ మూర్తి, టిఎస్వి నారాయణ, దేవబాబు, సుజ్ఞాన్, చక్రపాణి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కరపత్రాన్ని ఆవిష్కరించారు.

➡️