కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా సురేష్

Dec 3,2023 01:21

ప్రజాశక్తి – బాపట్ల
కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా కరెద్దుల సురేష్ ను కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు గంటా అంజిబాబు నియమించారు. స్థానిక కాంగ్రెస్‌ కార్యాలయంలో శనివారం నియామక పత్రాన్ని అందజేశారు. పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, మాజీ కేంధ్ర మంత్రి జెడి శీలం సూచనల మేరకు కరెద్దుల సురేష్‌ను కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించినట్లు తెలిపారు. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పదేళ్లుగా అధికారంలో లేకపోయినప్పటికీ కాంగ్రెస్ నాయకత్వం ఐక్యతతో పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బావుటా తిరిగి ఎగురవేయాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ చీరాల ఇన్‌చార్జి దేవరపల్లి రంగారావు, నాయకులు పాల్గొన్నారు.

➡️