– కంటైనర్లో ప్రత్యేక అర
– 400 కిలోల గంజాయి పట్టివేత
ప్రజాశక్తి-చిలమత్తూరుపుష్ప సినిమాలో ఎర్రచందనం దుంగలను పాల ట్యాంక్లో స్మగ్లింగ్ చేసిన తరహాలో గంజాయిని కంటైనర్లో తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. కంటైనర్ క్యాబిన్ పైభాగం వెనుక ఓ డోర్ను అమర్చుకుని అందులో సుమారు 400 కేజీల గంజాయిని తరలిస్తుండగా నిందితులను శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… విశాఖపట్నం నుంచి బెంగళూరుకు గంజాయి బస్తాలతో కంటైనర్ వాహనం బయళ్దేరింది. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో బుధవారం ఉదయం ఈ కంటైనర్ను శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్టు 44వ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీ చేశారు. కంటైనర్కు వెనుక ఓ ప్రత్యేక తలుపును ఏర్పాటు చేసుకుని అందులో గంజాయి బస్తాలను ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 400 కిలోల గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు డిఎస్పి కంజక్షన్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ. కోటిన్నర ఉంటుందని తెలిపారు.బెంగళూరులో నూతన సంవత్సర వేడుకలు జరగనున్న నేపథ్యంలో వీటిని అక్కడికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.