పేదలకు మేలు చేసే సూపర్‌సిక్స్‌

Mar 7,2024 22:24

ప్రజాశక్తి – చీరాల
రాష్ట్ర ప్రజలు వైసిపి ప్రభుత్వంతో విసిగిపోయారని టిడిపి ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఓట్లతో వైసిపికి బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మండలంలోని వాడరేవులో టిడిపి మేనిఫెస్టో వివరిస్తూ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపితోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందుతాయని అన్నారు. టిడిపి, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మెరుగై పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందని అన్నారు. టిడిపికి మద్దతు ఇవ్వాలని ఇంటింటికి తిరిగి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కౌతరపు జనార్ధన్, గంజి పురుషోత్తం, డేటా నాగేశ్వరరావు, చప్పిడి లక్ష్మి, ధోని కనకరాజు, గోశాల శ్రీను, బందు గురవయ్య, మంచాల రామిరెడ్డి, లావేటి శ్రీనివాస్ తేజ, రమేష్, తేలబ్రోలు నాగేశ్వరరావు, విన్నకోట జగదీష్, రంగరాజు, పృద్వి రామారావు, వంగపాటి నరసింహారావు, తారక రాముడు, రావూరి శేషగిరి, పఠాన్ అయూబ్ కాన్ పాల్గొన్నారు.

➡️