లోక్‌సభ ఎన్నికల తరువాత రాహుల్‌గాంధీకి సమన్లు

Mar 6,2024 11:07 #Rahul Gandhi, #summons

గౌహతి :    భారత్‌ జోడో న్యారు యాత్రలో హింసాత్మక ఘటనల కేసులో రాహుల్‌ గాంధీకి లోక్‌సభ ఎన్నికల తరువాత సమన్లు జారీ చేస్తామని, పోలీసు విచారణకు భౌతికంగా హాజరుకావాల్సి ఉంటుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం తెలిపారు. ‘ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు సమన్లు జారీ చేయబడతాయి. రాహుల్‌గాంధీకి కూడా సమన్లు వెళ్తాయి’ అని శర్మ అన్నారు. ఈ కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జాకీర్‌ హుస్సేన్‌, అస్సాం పిసిసి చీఫ్‌ భూపేన్‌కుమార్‌ బోరాలకు సమన్లు జారీ చేయడం ‘విచారణ యొక్క ప్రారంభం’ మాత్రమేనని ముఖ్యమంత్రి అన్నారు. జనవరిలో గౌహతిలోని ప్రధాన వీధుల్లో భారత్‌ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు బారికేడ్లు ధ్వంసం చేసినట్లు ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే.

➡️