యువకుడి ఆత్మహత్యయత్నం

Feb 19,2024 11:53 #Anantapuram District
Suicide attempt of youth

ప్రజాశక్తి-రాయదుర్గం : రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ కు చెందిన మంజునాథ అను యువకుడు సోమవారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లు విరిగాయి. వాల్మీకి నగర్ చెందిన స్థానికులు రైలు పట్టాల వద్ద మంజునాథను గమనించి ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకై మంజునాథను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. శాంతినగర్ కు చెందిన మంజునాథ కొంతకాలం క్రితం డిగ్రీ పూర్తి చేసుకుని గార్మెంట్ పరిశ్రమలో సహాయకుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి నుండి మంజునాథ ఇంట్లో కనబడకపోగా ఉదయం రైలు పట్టాల వద్ద అతడు గాయపడిన స్థితిలో కుటుంబ సభ్యులు గమనించారు. అయితే మంజునాథ్ ఆత్మహత్యకు కారణం తెలియరాలేదు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

➡️