2కె రన్ ప్రారంభించిన సబ్ కలెక్టర్

Jan 24,2024 11:35
sub collector launch 2k run

ప్రజాశక్తి-తెనాలి : 14వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 2కె రన్ ను సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ బుధవారం ఉదయం ప్రారంభించారు. పురపాలక సంఘ కార్యాలయం నుంచి ప్రారంభించిన రన్ లో కమిషనర్ ఎం జస్వంత్ రావు, తహసిల్దార్ కె రవిబాబు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ 2 ఎల్ సుబ్బారావు, ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రామచంద్రరావు, డి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

➡️