‘వీధి బడి’ కవితకు పురస్కారం

Apr 7,2024 15:51 #Awards, #East Godavari, #kavithalu

ప్రజాశక్తి-కడియం : కడియం గ్రామానికి చెందిన వర్ధమాన కవి చిలుకూరి శ్రీనివాసరావు రచించిన ‘వీదిబడి’ కవితకు ఉత్తమ పురస్కారం లభించింది. క్రోదినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం కోనసీమ జిల్లా కొత్తపేట కళాసాహితీ ఆధ్వర్యంలో కవితా సమ్మేళనం జరిగింది.దీనిలో శ్రీనివాసరావు ఆలపించిన ‘వీధి బడి’ కవితకు ఉత్తమ బహుమతి అందించారు. కళాశాహితి అధ్యక్షులు పెనుమత్స హరిహర దేవళ రాజు,ప్రధాన కార్యదర్శి ‌గిడ్డు సుబ్బారావు, తెలుగు ప్రొఫెసర్ టి ఎన్ సత్యనారాయణ, ప్రముఖ కవి జోస్యుల కృష్ణ బాబు చేతుల మీదుగా శ్రీనివాసరావు సత్కారం, కళా సాహితి పురస్కారం అందుకున్నారు.

➡️