హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. రికార్డు జీఎస్టీ వసూళ్లు, త్రైమాసిక ఫలితాలు సూచీలను ముందుకు నడిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం మరో పాజిటివ్ అంశం. ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ షేర్లు రాణించగా.. బ్యాంక్, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో సూచీలు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి.