ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హను-మాన్’ చిత్రానికి కొనసాగింపుగా రానున్న ‘జై హనుమాన్’లో స్టార్ హీరో నటిస్తున్నట్లు ప్రశాంత్ తెలిపారు. ‘హను-మాన్’ సక్సెస్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని మాట్లాడారు. ‘హను-మాన్’ కంటే వందరెట్లు భారీ స్థాయిలో ‘జై హనుమాన్’ ఉండనుంది. సీక్వెల్లో తేజ సజ్జా హీరో కాదు. సీక్వెల్లోనూ అతడు హనుమంతు పాత్రలో కనిపిస్తాడు. కానీ, ఆ సినిమా హీరో ఆంజనేయ స్వామి. ఆ పాత్రను స్టార్ హీరో చేస్తారు. 2025లో ఇది విడుదల కానుంది. దీనికంటే ముందు నా నుంచి మరో రెండు చిత్రాలు రానున్నాయి. అందులో ఒకటి ‘అధీర’. మరొకటి ‘మహాకాళి” అని ప్రశాంత్ చెప్పారు.