శ్రీశైలం పాదయాత్రికులకు ఉచిత వైద్య శిబిరం

Mar 2,2024 16:06 #Free medical camp, #Kurnool

ప్రజాశక్తి – గోనెగండ్ల (కర్నూలు) : శ్రీశైలం పాదయాత్రకు వెళ్లే కర్ణాటక, ఆంధ్ర భక్తుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని మండల కేంద్రమైన గోనెగండ్లలో ఆర్‌ఎంపీ వైద్యులు ఉస్మాన్‌ మియా నాగేశ్వరరెడ్డి ఫార్మసిస్ట్‌ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వాహకులు సురేష్‌ బాబు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని గోనెగండ్ల సీఐ రామకృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరాన్ని పాదయాత్ర భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.శ్రీశైలానికి వెళ్లే పాదయాత్రికులకు ఎండ వేడికి కాళ్లు మొబ్బలెక్కడం, వడదెబ్బ జ్వరము ఒళ్ళు నొప్పులతో పాటు ఏవైనా అనుకోని అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఈ శిబిరం ద్వారా ఉచిత వైద్య సేవలతో పాటు మందులు కూడా ఉచితంగా పొందవచ్చు అని అన్నారు.గత ఐదు సంవత్సరాలుగా సేవా దృక్పథంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవలు అందించడం పట్ల నిర్వాహకులను సిఐ అభినందించారు.

➡️