సాయినాధుడి వార్షికోత్సవ వేడుకలలో శ్రీనివాసరాజు

Nov 29,2023 13:01 #Annamayya district
srinivasarao in annadanam

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : సాయి నగర్ లో వెలసి ఉన్న శ్రీసాయి సద్గురు ఆలయ 24వ వార్షికోత్సవం వేడుకలలో మాజీ డిఆర్డిఏ రాష్ట్ర అధికారి, రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు ఎల్లటూరు శ్రీనివాసరాజు పాల్గొన్నారు. వేడుకలులో భాగంగా బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు యల్లటూరు శ్రీనివాసరాజు ముఖ్య అతిథిగా పాల్గొని కాకడ హారతి, గణపతి పూజ, పుణ్యవాచనము, అభిషేకము, భజన, పల్లకి సేవ, సేజ్ హారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన విశేష అన్నదాన కార్యక్రమంలో శ్రీనివాసరాజు పాల్గొని స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకలిగా ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడంలో ఆత్మసంతృప్తి ఉంటుందని, ఆలయ కమిటీ భక్తులకు, పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడం హర్షనీయమని అన్నారు. సద్గురు శ్రీ సాయినాథుడి ఆశీస్సులతో రాజంపేట నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు రఘునాథరెడ్డి, శివరాజు, ధనుంజయ, నరసారెడ్డి, సుబ్బరాజు, కృష్ణమూర్తి, ఎం.కె రాజులు శ్రీనివాసరాజును పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, కడిమెల శ్రీనివాసరాజు, మౌల, పత్తి నారాయణ, చిట్టే భాస్కర్, పి.వి.ఆర్ కుమార్, ఆకుల చలపతి, రాజ ఆచారి, నాసర్ ఖాన్, సురేష్ బాబు, అఖిల్, నాని సాయి రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️