బీజింగ్‌ చేరుకున్న శ్రీలంక ప్రధాని ..

కొలంబొ   :    శ్రీలంక ప్రధాని దినేష్‌ గుణవర్ధన చైనాలో ఆరు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం బీజింగ్‌కు చేరుకున్నారు. ఆయనను చైనా ఉప విదేశీ వ్యవహారాల మంత్రి, భారత మాజీ రాయబారి సన్‌ వీడాంగ్‌ ఆహ్వానించినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసే మార్గాలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ప్రీమియర్‌ లి ఖియాంగ్‌తో చర్చలు జరపనున్నట్లు వెల్లడించింది.   హంబన్‌ తోట నౌకాశ్రయానికి చైనా పరిశోధనల నౌక సందర్శనపై శ్రీలంక తాత్కాలిక నిషేధం విధించిన అనంతర శ్రీలంక ప్రధాని మొదటిసారి చైనాలో పర్యటించడం గమనార్హం.

➡️