శ్రీలంక కొత్త కెప్టెన్లు.. వన్డేలకు కుశాల్‌ మెండిస్‌.. టీ20లకు హసరంగ

Dec 30,2023 16:19 #Cricket, #Sports, #srilanka

సొంతగడ్డపై జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు 21 మంది సభ్యుల జట్టును ప్రకటించిన లంక సెలక్షన్‌ కమిటీ.. టీ20లకు 22 మందితో కూడిన ప్రాథమిక జట్లను ఎంపిక చేసింది. దసున్‌ షనక స్థానంలో ఆయా ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమిస్తున్నట్లు తెలిపింది. వన్డే పగ్గాలను కుశాల్‌ మెండిస్‌కు, టీ20 జట్టు సారథ్య బాధ్యతలను వనిందు హసరంగకు అప్పగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది.

జింబాబ్వేతో టీ20లకు శ్రీలంక ప్రాథమిక జట్టు:వనిందు హసరంగ (కెప్టెన్‌), చరిత్‌ అసలంక (వైస్‌ కెప్టెన్‌), పాతుమ్‌ నిస్సాంకా, కుశాల్‌ మెండిస్‌, సదీర సమరవిక్రమ, దసున్‌ షనక, ఏంజెలో మాథ్యూస్‌, ధనంజయ డి సిల్వా, మహీశ్‌ తీక్షణ, కుశాల్‌ జనిత్‌ పెరీరా, భనుక రాజపక్స, కమిందు మెండిస్‌, దునిత్‌ వెల్లలగే, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక కరుణరత్నె, దుష్మంత మచీర, దిల్షాన్‌ మదుశంక, బినుర ఫెర్నాండో, నువాన్‌ తుషార, ప్రమోద్‌ మదుషాన్‌, మతీశ పతిరణ.

➡️