25న మైనారిటీల ఆత్మీయ సమావేశం

Feb 23,2024 22:43

ప్రజాశక్తి – యద్దనపూడి
ఈనెల 25న పర్చూరులో జరిగే ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని పూనూరు గ్రామంలో టిడిపి మైనారిటీ సెల్ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రెటరీ షేక్ అబ్దుల్ రజాక్ శుక్రవారం ప్రచారం చేశారు. గ్రామంలోని ముస్లింలు అందరు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్, మార్టూరు గ్రామ ఉపాధ్యక్షులు సెల్ సుభాని, పూనూరు మాజీ సర్పంచ్ సాంబయ్య పాల్గొన్నారు.

➡️