ప్రజాశక్తి-కడియం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు తెలిపారు. మండలంలోని కడియపులంకలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభింంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి ప్రత్యేక మోదా, విభజన హామీలు కానీ, పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టులు, యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, ఆరోగ్య సంస్థలు మొదలైన ఎలాంటి హామీలనూ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు వైసిపి, టిడిపి కేంద్రం నుంచి ఏమీ సాధించలేక పోయారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొమ్మిది గ్యారెంటీలను ఇచ్చిందని, వాటిలో ప్రధానమైనది ప్రత్యేక హోదా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసిసి ఎలక్షన్ అబ్జర్వర్ మనోజ్ చౌహన్, పిసిసి వైస్ ప్రెసిడెంట్ కొత్తూరు శ్రీనివాస్, పిసిసి జనరల్ సెక్రటరీలు ముళ్ల మాధవ్, మార్టిన్ లూథర్, జిల్లా అధ్యక్షురాలు అరిగెల అరుణకుమారి, రాజమహేంద్రవరం రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఎ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జె.కిషోర్, తాడాల కొండ్రాజు, ఉలిశెట్టి సత్తిబాబు, జెటి రామారావు, కార్యకర్తలు పాల్గొన్నారు.