ప్రెస్ క్లబ్‌కు స్థలం కేటాయించాలి

Dec 3,2023 01:23

ప్రజాశక్తి – రేపల్లె
ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ తహశీల్దారు మల్లిఖార్జునరావుకు జర్నలిస్టులు శనివారం వినతిపత్రం అందజేశారు. సీనియర్ జర్నలిస్ట్ బొడ్డు మనివర కుమార్ మాట్లాడుతూ తాలూకా ప్రాంగణంలోని విఆర్‌ఒ భవనం, తహశీల్దారు గెస్ట్ హౌస్ మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని ప్రెస్ క్లబ్‌కు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. స్పందించిన తహశీల్దారు మల్లికార్జునరావు మీడియా మిత్రులకు తాను ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తానని సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. తహశీల్దారు మీడియా తరుపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్టులు ఆనంద్, వెంకయ్య, రమేష్ బాబు, భారత్, గంగాధర్, బాను పాల్గొన్నారు.

➡️