దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతపై కత్తితో దాడి

Jan 2,2024 17:01 #South Korea

సియోల్‌: దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత లీ జే మ్యూగ్‌పై దుండగుడు కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో మ్యూగ్‌ మెడకి గాయమైంది. బుసాన్‌ పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం నిర్మాణంలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌ పనులను మ్యూగ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి అతనిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మ్యూగ్‌ మెడకి గాయమై వెంటనే కిందపడిపోయారు. దీంతో ఆయన్ని చికిత్స కోసం ఆసుపత్రకి తరలించారు. కాగా, ఈ ఘటన అనంతరం దుండగుడు పారిపోతుండగా.. అక్కడున్నవారు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 20 నుంచి 30 ఇంచుల పొడవున్న కత్తితో దుండగుడు దాడిచేసినట్లు అధికారులు తెలిపారు. మ్యూగ్‌ 2022 ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ చేతిలో మ్యూంగ్‌ ఓడిపోయారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గత సెప్టెంబర్‌లో 24 రోజులపాటు నిరసన దీక్ష చేశారు.

➡️