- రాజ్యసభ ఎంపిగా ప్రమాణ స్వీకారం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభ సభ్యులుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. గురువారం నాడిక్కడ ఆమెతో పాటు మరో 14 మందితో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రమాణం చేయించారు. సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రమాణం చేసిన వారిలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఉన్నారు. ఆయన ఒడిషా నుంచి ఎన్నికయ్యారు. అజరు మాకెన్ (కర్ణాటక), సయ్యద్ నసీర్ హుస్సేన్ (కర్ణాటక), ఆర్ఎన్ పి సింగ్ (ఉత్తరప్రదేశ్), సమిక్ భట్టాచార్య (పశ్చిమ బెంగాల్), సంజరు కుమార్ ఝా (బీహార్), సుభాశిష్ ఖుంటియా (ఒరిస్సా), దేబాశిష్ సామంతరారు (ఒరిస్సా), మదన్ రాథోడ్ (రాజస్థాన్) తదితరులు ఉన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్కి చెందిన ముగ్గురు వైసిపి ఎంపిలు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాధ రెడ్డి, తెలంగాణకి చెందిన బిఆర్ఎస్ ఎంపి వద్దిరాజు రవిచంద్ర కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు.