గంజాయి అమ్ముతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి..

హైదరాబాద్: హైదరాబాద్ లో గంజాయి అమ్ముతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 55 వేల విలువ చేసే 1.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. . వివరాల్లోకి వెళ్తే.. మాదాపూర్ ఏరియాలో గంజాయి అమ్ముతున్నట్టు సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు. మాదాపూర్ ఖాన్ మెట్ లోని శ్రీకర కొలీవ్ హాస్పిటల్ లో నెట్వర్క్ ఇంజనీర్ గా పని చేసే యాపుగంటి ఫణి కిరణ్ అనే వ్యక్తి నుంచి 1.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఫణిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఫణికుమార్ ఏపీ రాష్ట్రం రావులపాలెంకు చెందినవాడని తెలిసింది. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చి మాదాపూర్‌ పీఎస్‌ పరిధిలోని ఖానామెట్‌లోని ప్రయివేట్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. గతంలో ఆదిబట్ల పీఎస్ పరిధిలో ఎన్డీపీఎస్ కేసులోఅరెస్ట్ అయ్యాడు.

➡️