ఇప్పటివరకు 708 మంది వలంటీర్లు రాజీనామా

Apr 14,2024 12:14 #708, #resigned, #volunteers

ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో వలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 708 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. వీరిలో 139 మంది శనివారం ఒక్కరోజే రాజీనామా పత్రాలను సమర్పించారు. దీంతో జిల్లాలో రాజీనామా చేసినవారి సంఖ్య 708 కి చేరింది. వలంటీర్‌ పదవులకు రాజీనామా చేసిన వారిలో బబ్బిలి నియోజకవర్గంలో 59 మంది, చీపురుపల్లిలో 10, గజపతినగరంలో 149, నెల్లిమర్లలో 280, రాజాంలో 95, ఎస్‌.కోటలో 61, విజయనగరంలో 36, సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలంలో 18 మంది ఉన్నారు. మరో 16 మంది వలంటీర్లుపై ఫిర్యాదులు రావడంతో వారిని ఇంతకుముందే తొలగించారు.

➡️