ప్రజాశక్తి-ఇచ్చాపురం : ఇచ్ఛాపురం పట్టణంలో సోమవారం నాడు ఉదయం 9గంటలు అవుతున్న పూర్తీగా పొగమంచుతో కప్పపడింది. గత మూడు రోజులుగా వేకువ జామున కొంత మంచు ఉంటున్నప్పటికీ సోమవారం నాడు పొగమంచుతో రాకపోకలు స్తంభించాయి. క్రీడా మైదానంలో వాకర్స్ కి ఇతర క్రీడా శిక్షణ పొందుతూ న్న క్రీడాకారులు పొగ మంచుతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎప్పుడు లేనివిధంగా ఈ సారి సంక్రాంతి పండుగ రోజు భయంకరమైన పొగమంచుతో కప్పపడడం పలువురు ఇబ్బందులు పడ్డారు. ఉదయం తొమ్మిది గంటల తర్వాత కానీ ఎదురుగా వస్తున్న వాహనాలు రాకపోకలు కనిపించాయి.