ముంబయి : కొత్త ఏడాది 2024 తొలి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నాం తర్వాత కొంత కొనుగోళ్ల మద్దతు లభించింది. తుదకు బిఎస్ఇ సెన్సెక్స్ 31.68 పాయింట్లు పెరిగి 71,272 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 10.50 పాయింట్ల స్వల్ప లాభంతో 21,742 వద్ద నమోదయ్యింది. నిఫ్టీలో నెస్లే, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, హిందాల్కో షేర్లు అధిక ఒత్తిడిని ఎదుర్కొన్న వాటిలో ఉన్నాయి.