ముంబయి : గడిచిన రెండేళ్లలో లక్ష కార్లను విక్రయించినట్లు స్కోడా ఆటో ఇండియా వెల్లడించింది. కంపెనీ తన భారత కార్యకలాపాల్లో అతి తక్కువ సమయంలో ఈ మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంది. తమ కుషాక్, స్లావియాలకు కొనసాగుతున్న డిమాండ్ బలమైన అమ్మకాలను మద్దతునిచ్చిందన్నారు. 2023 చివరి నాటికి దేశవ్యాప్తంగా 260 కస్టమర్ టచ్పాయింట్లకు విస్తరించినట్లు వెల్లడించింది. 2024 నాటికి స్కోడా ఆటో వియత్నాంలోకి ప్రవేశించడంలో కంపెనీ పూణే ప్లాంట్లోని ఉత్పత్తులు, పార్టులు, కాంపోనెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని స్కోడా విశ్వాసం వ్యక్తం చేసింది.