ఐసీసీ జట్టులో ఆరుగురు భారత ఆటగాళ్లకు స్థానం

Nov 20,2023 15:59 #Cricket

వన్డే ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన ఆటగాళ్లతో కూడిన జట్టును అంతర్జాతీయ క్రికెట్‌ మండలి తాజాగా వెల్లడించింది. అందులో ఆరుగురు భారత ఆటగాళ్లు స్థానం సంపాదించారు. ఆస్ట్రేలియా జట్టు నుంచి కేవలం ఇద్దరికి మాత్రమే ఐసీసీ చోటు కల్పించింది. దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరిని ఎంపిక చేసింది.

టీమ్‌ ఇదే..
భారత్‌ : విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, మహమ్మద్‌ షమీ, బుమ్రా
ఆస్ట్రేలియా : గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఆడమ్‌ జంపా
దక్షిణాఫ్రికా : క్వింటన్‌ డికాక్‌, గెరాల్డ్‌ కొయిట్జీ
న్యూజిలాండ్‌ : డారిల్‌ మిచెల్‌
శ్రీలంక : దిల్షాన్‌ మదుషంక

➡️