సిపిఎం నాయకులు కోటిరెడ్డి కుమార్తె సింధు మృతి

Jan 9,2024 09:40 #cpm leader, #death
  • నేడు తాడేపల్లిలో అంత్యక్రియలు

ప్రజాశక్తి- తాడేపల్లి (గుంటూరు జిల్లా) : సిపిఎం నాయకులు, మార్క్సిస్టు సైద్ధాంతిక మాసపత్రిక బాధ్యులు అన్నపరెడ్డి కోటిరెడ్డి కుమార్తె అన్నపరెడ్డి సింధు (36) సోమవారం మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ సౌధా కార్యాలయంలో ఎడిగా సింధు పనిచేస్తున్నారు. ఆమెకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఆమె భర్త బుర్రముక్కు శ్రీకాంత్‌రెడ్డిది తాడేపల్లి. సింధు అంత్యక్రియలు తాడేపల్లిలో మంగళవారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

పలువురు నివాళి, సంతాపం

సింధు భౌతికకాయానికి సోమవారం రాత్రి తాడేపల్లిలోని ఆమె స్వగృహంలో పిడిఎఫ్‌ మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ, ప్రజాశక్తి ఎడిటర్‌ బి.తులసీదాస్‌, సిజిఎం వై.అచ్యుతరావు, జనరల్‌ మేనేజర్‌ కె.హరికిషోర్‌, ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి చిష్టి తదితరులు నివాళులర్పించారు. సింధు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ, నాయకులు డి.వెంకటరెడ్డి, శ్రీనివాసకుమారి, శేషారత్నం, పి.గిరిజ, బి.శ్రీనివాసరావు, లక్ష్మణరావు తదితరులు సంతాపం తెలిపారు.

➡️