వెండి రధోత్సవం

Apr 21,2024 21:51

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై ఈ నెల 19వ తేదీ నుండి 27 తేదీ వరకు జరుగుతున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఆలయ ఇఒ కె.ఎస్‌.రామరావు ఆధ్వర్యంలో ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం కోలాటలు, ఇతర సాంస్కతిక కార్యక్రమాల నడుమ స్వామి, అమ్మవార్లు వెండి రథంపై మహా మండపం నుండి వెండి రధంపై బయలుదేరి కనకదుర్గా నగర్‌, కుమ్మరిపాలెం సెంటర్‌, కామకోఠి నగర్‌, శంకరమఠం, సితార సెంటర్‌, సొరంగం, కొత్తపేట, బ్రాహ్మణ వీధి, రధం సెంటర్‌ మీదుగా మహా మండపం చేరుకున్నారు.

➡️