ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా-ఆర్సిబి మధ్య మ్యాచ్లో కోల్కతా ఇన్నింగ్స్ ముగిసింది. కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (50) హాఫ్ సెంచరీ, ఫిలిప్ సాల్ట్ (48), ఆండ్రి రస్సెల్ (27), రమన్దీప్ (24), రింకు సింగ్ (24) రాణించడంతో 226 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (15), రఘువంశి (3), వెంకటేశ్ అయ్యర్ (16) బ్యాటింగ్లో నిరాశపరిచారు. ఆర్సిబి బౌలర్లలో యశ్ దయాల్ 2, గ్రీన్ 2, సిరాజ్ 1, ఫెర్గుసన్ 1 వికెట్ తీశారు. ఆర్సిబి గెలవాలంటే 20 ఓవర్లలో 223 పరుగులు చేయాల్సి ఉంది.