ప్రేగ్ : చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్లోని ఒక యూనివర్శిటీలో ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో 15 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. సాయుధుడ్ని కూడా పోలీసులు కాల్చి చంపారు. గురువారం మద్యాహ్నం 3 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఛార్లెస్ యూనివర్శిటీలోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులు ప్రారంభించారు. సిబ్బందిని గదిలో బంధించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని యూనివర్శిటీని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. తరువాత షూటర్ను కాల్చిచంపారు.