ఏపీ పీసీసీ చీఫ్‌గా షర్మిల నియామకం

Jan 16,2024 14:35 #Congress, #ys sharmila
Congress Election Committee headed by Sharmila

ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నన కాంగ్రెస్‌ పార్టీ ఏపీ పీసీసీ చీఫ్‌గా షర్మిలను నియమించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్‌ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ పీసీసీ చీఫ్‌ గా ఉన్న గిడుగు రుద్రరాజు సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. అయితే, గిడుగు రుద్రరాజును కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

➡️