లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కారం

Mar 17,2024 00:41

ప్రజాశక్తి – పర్చూరు
స్థానిక కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయలోక్ అదాలత్‌ నిర్వహించారు. రెండు కోర్టుల్లో సీసీఐ, ఐపీఎస్ కేసులు 28, చెక్ బౌన్స్ కేసులు మూడింటిలో రూ.14.60లక్షలకు పరిష్కరించారు. గృహహింసగేసు ఒకటి, భరణం కేసులు 3, కేసు ఒకటి రూ.46,400 డీఎస్ మనీ కేసులు నాలుగు, రూ.8.40లక్షలు రికవరీ చేశారు. శాశ్వతభరణం కేసులు ఐదు రూ.21.21వేల చొప్పున మొత్తం 45కేసులు పరిష్కరించారు. మొత్తం విలువ రూ.45లక్షల రాబట్టారు. సీనియర్ సివిల్ జడ్జి కుమారి కె ప్రశాంతి, జూనియర్ సివిల్ జడ్జి పి శాంతి ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు రావి రమేష్ బాబు, రావి సత్యనారాయణ, సిహెచ్ రమణి, డి రాఘవయ్య చౌదరి, తులసి రాజేషు ధనలక్ష్మి, న్యాయవాది మండవ వీరాంజనేయులు, మేక రవీంద్రనాద్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️