మూడో చలివేంద్రం ఏర్పాటు 

Apr 6,2024 12:43 #Nellore District

ప్రజాశక్తి-కందుకూరు : ప్రతి సంవత్సరం వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని మంచినీరు అందించే సురేష్ రెడ్డి చికెన్ సెంటర్ అధినేత సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఈసారి కూడా తన తండ్రి సన్నారెడ్డి, రామిరెడ్డి  పేరు మీద స్థానిక అంబేద్కర్ సెంటర్ లో మూడో చలివేంద్రం ఏర్పాటు చేశారు. దివి లింగయ్య నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి పెద్ద కుమారుడు సన్నారెడ్డి నిరంజన్ రెడ్డి, చిన్న కుమారుడు సన్నారెడ్డి మోహన్ కిషోర్ రెడ్డి పాలుపంచుకుని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు, స్థానికులు హాజరయ్యారు. సురేష్ రెడ్డి ఇది వరకే పామూరు బస్ స్టాండ్ దగ్గిర, మార్కెట్ సెంటర్ లో సురేష్ రెడ్డి చికెన్ సెంటర్ దగ్గిర రెండు చలివేంద్రాలు ఏర్పాటు చేసి నిర్వహిస్తుండగా ఈ రోజు అంబేద్కర్ సెంటర్ లో మూడో చలివేంద్రం ఏర్పాటు చేశారు.

➡️