అక్కిరాజు మెమోరియల్‌ ట్రస్ట్‌కు సేవా పురస్కారం

Apr 5,2024 00:03

అవార్డును అందుకుంటున్న ట్రస్ట్‌ అధ్యక్షుడు లతేంద్ర వర్మ

ప్రజాశక్తి-రాజోలు

రాజోలుకు చెందిన ముదునూరి అక్కిరాజు మెమోరియల్‌ ట్రస్టుకు సేవా పురస్కారం లభించిందని ట్రస్ట్‌ అధ్యక్షడు ముదునూరి లతేంద్ర వర్మ తెలిపారు. గురువారం ఆయన రాజోలుల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీ కేంద్రంగా 25 సంవత్సరాలుగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న ఆదిలీల ఫౌండేషన్‌ గత నెల 30, 31వ తేదీల్లో గోవాలో ఆదిలీల ఫౌండేషన్‌ మరియు మీడియా హౌస్‌ సంయుక్తంగా అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించిందన్నారు. ఈ కార్యక్రమంలో ముదునూరి అక్కిరాజు మెమోరియల్‌ ట్రస్టు కు అవార్డు లభించిందన్నారు. ఈ అవార్డును తాను స్వీకరిం చానన్నారు. ఆదిలీల ఫౌండేషన్‌ అధ్యక్షులు ఆదినారాయణ తమను గుర్తించి అవార్డు అందించడం తమపై మరింత బాధ్యతను పెంచిందని లతేంద్ర వర్మ అన్నారు.సుమారు 17 రాష్ట్రాల నుంచి విచ్చేసిన వివిధ స్వచ్ఛంద సంస్థలతో పాటు వివిధ విభాగాలలో సుమారు 48 మందికి అవార్డు అందించారు. ఈ అవార్డుల కార్యక్రమంలో మానవతామూర్తుల సంస్థ లక్కవరానికి చెందిన బోనం రాజుకు సేవా పురస్కారం లభించింది.

 

➡️