పోస్టల్‌ ద్వారా పంపండి

Jan 6,2024 10:50 #RBI

రూ.2 వేల నోట్ల మార్పిడిపై ఆర్‌బిఐ ప్రకటనన్యూఢిల్లీ : పోస్టాఫీసుల ద్వారా రూ.2 వేల నోట్లను తమ పరిధిలోని 19 ఇష్యూ కేంద్రాలకు పంపి, మార్పిడి చేసుకోవచ్చునని భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బిఐ) శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆర్‌బిఐ ఇష్యూ కేంద్రాల వద్ద మాత్రమే రూ.2 వేల నోట్లను మార్పిడి చేసుకునే వీలుండటంతో అక్కడ భారీ రద్దీ నెలకొంటోంది. దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచైనా సరే 19 ఆర్‌బిఐ ఇష్యూ కేంద్రాలకు నోట్లను పంపవచ్చనని తెలిపింది. నోట్లతోపాటు అప్లికేషన్‌ ఫామ్‌ (ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది) కూడా పంపాలని పేర్కొంది.

➡️