ఇటలీపై గెలుపుతో సెమీస్‌కు..

Jan 17,2024 08:22 #Hockey, #Sports
  • ఎఫ్‌ఐహెచ్‌ మహిళల హాకీ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌

రాంచీ: ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళా క్రీడాకారిణులు సత్తా చాటారు. పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ క్రీడాకారిణులు సత్తా చాటారు. మ్యాచ్‌ ప్రారంభమైన తొలి నిమిషంలోనే గోల్‌ కొట్టి 1-0 ఆధిక్యతలో నిలిపారు. ఆ తర్వాత భారత క్రీడాకారిణులు పుంజుకొని పలుమార్లు ఇటలీ గోల్‌పోస్ట్‌లోకి ప్రవేశించినా గోల్స్‌ చేయడంలో విఫలమయ్యారు. రెండోఅర్ధభాగం పూర్తయ్యేసరికి భారత్‌ 7సార్లు గోల్‌ చేసే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీంతో అర్ధభాగం ముగిసేసరికి భారత్‌ 1-0తో నిలిచింది. గ్రూప్‌ స్టేజ్‌లో చివరి నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత మహిళల హాకీజట్టు ఇటలీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు తొలి లీగ్‌ మ్యాచ్‌లో అమెరికా చేతిలో 1-0గోల్స్‌తో ఓడిన భారత్‌.. ఆ తర్వాత పటిష్ట న్యూజిలాండ్‌ను 3-1గోల్స్‌తో చిత్తుచేసి రేసులో నిలిచింది. ఈ మ్యాచ్‌ను భారత్‌ డ్రా చేసుకున్నా సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండనుంది.

➡️