ప్రజాశక్తి-అమరావతి : అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మొత్తం 175 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేస్తామన్న సీఎం జగన్పై సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9.10 గంటలైనా అసెంబ్లీ హాలు ఖాళీగా ఉండడంతో ఆయన మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
వైసీపీ పాలనకు ఇదే అంతం
వైనాట్ 175 అంటూ బిల్డప్ ఇస్తున్న జగన్ రెడ్డి తన సొంత ఎమ్మెల్యేల నమ్మకమే పొగొట్టుకున్నాడు.
అసెంబ్లీ సమావేశాలకు పట్టుమని పదిమంది కూడా రాకపోవడం చూస్తుంటే వైసీపీ పాలనకు ఇదే చివరి అసెంబ్లీ అనేది స్పష్టమైంది..!#APAssembly #JaganFailedCM#APHatesJagan… pic.twitter.com/GJsgPFlFq2
— Dhulipalla Narendra Kumar (@DhulipallaNk) February 8, 2024
9 గంటలకే అసెంబ్లీ జరపాలని నోటీసు ఇవ్వడంతో తాము 8.55 గంటలకే అసెంబ్లీకి వచ్చామని, కానీ 9.10 అయినా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమే సభలో ఉన్నారని, జగన్పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉండే నమ్మకం ఇదేనని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9.10 గంటలైనా బెల్ కొట్టలేదని పేర్కొన్నారు. లోపల ముగ్గురంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండడమే అందుకు కారణమని అన్నారు. దీనిని బట్టి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద వైసీపీ ఎమ్మెల్యేలకు ఉన్న నమ్మకం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చన్నారు.