ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి సచివాలయ ఉద్యోగి మృతి

Mar 30,2024 23:43 ##Markapuram #Sachivalayam

ప్రజాశక్తి – మార్కాపురం
ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి సచివాలయ ఉద్యోగం మృతి చెందిన సంఘటన పట్టణంలోని పంచాయతీరాజ్ కార్యాలయం సమీపంలో శనివారం జరిగింది. ప్రమాదంలో బేతం మల్లయ్య (34) మృతి చెందాడు. మృతుడు నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మార్కాపురం మున్సిపాలిటీలోని 12వ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అతనికి వివాహం కాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు స్థానిక ప్రభుత్వ జిల్లా వైద్యశాల్లో చేర్పించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. పట్టణ ఎస్ఐ షేక్ అబ్దుల్ రెహమాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️