చల్లపల్లికి చేరిన సంకల్ప యాత్ర

Apr 9,2024 22:51

ప్రజాశక్తి-చల్లపల్లి

టిడిపి, జనసేన, బిజెపి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు చల్లపల్లిలో ప్రజలు స్వాగతం పలికారు. మంగళవారం చేపట్టిన సంకల్పయాత్ర శ్రీకాకుళం నుండి బయలుదేరి కొడాలి మీదుగా చల్లపల్లి చేరుకుంది. మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్‌ను కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. సంకల్పయాత్ర చల్లపల్లికి చేరుకోవడంతో ట్రాఫిక్‌ అంతరాయము ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ యాత్రలో కొనకళ్ల నారాయణరావు, విమల్‌ కృష్ణ, వెంకటేశ్వరరావు, మండల వెంకట్రామ్‌, మోర్ల రాంబాబు, చల్లపల్లి సర్పంచ్‌ పైడిపాముల కృష్ణకుమారి పాల్గొన్నారు. సంకల్ప యాత్రకు తరలివెల్లిన నేతలుప్రజాశక్తి-కోడూరు: శ్రీకాకుళం నుంచి అవనిగడ్డ వరకు జనసేన టిడిపి బిజెపి పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన సంకల్ప ర్యాలీకి కోడూరు మండలం నుంచి భారీగా కూటమి శ్రేణులు తరలి వెళ్లారు. కోడూరు మండలం టిడిపి మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు, జనసేన పార్టీ అధ్యక్షులు మర్రి గంగయ్య, ఉల్లి శేషగిరిరావు ఆధ్వర్యంలో జనసేన, టీడీపీ బిజెపి చెందిన కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఘంటసాల మండలం శ్రీకాకుళంకు బైక్‌ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. మోపిదేవి: అవనిగడ్డ నియోజకవర్గం జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్‌, పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలసౌరి పోటీ చేస్తున్న సందర్భంగా అవనిగడ్డ వస్తున్న బాలసౌరికి స్వాగతం పలుకుతూ శ్రీకాకుళం నుండి అవనిగడ్డ వరకు టిడిపి, జనసేన కార్యకర్తలు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం మోపిదేవి సెంటర్లో పోషడుపు రత్న గోపాల్‌, నడకదుటి జనార్దన్‌ రావు జెండా ఊపి బైక్‌ ర్యాలీని ప్రారంభించారు.

➡️