ఇంటర్నెట్డెస్క్ : తన భర్త షోయబ్తో విడాకుల అనంతరం సానియామీర్జా ఇన్స్టాగ్రామ్లో తొలిసారి ఓ పోస్ట్ పెట్టింది. అద్దంలో తనను తాను చూసుకుంటున్న పిక్ని షేర్ చేసింది. ఈ ఫొటోకి ‘రిఫ్లెక్ట్’ అనే క్యాప్షన్ని జోడించింది. సానియా తనని తాను సమీక్షించుకుంటున్నట్లు అర్థం వచ్చేలా పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది.
కాగా, షోయబ్ – సానియా జంట ఇద్దరు విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. సోషల్మీడియాలో వార్తలు ట్రెండ్ అయినా.. వీటిపై సానియా ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా షోయబ్.. హీరోయిన్ సనాజావెద్ను వివాహం చేసుకున్నట్లు ప్రకటించాడు. సోషల్ మీడియాలో వారి పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ తన మొదటి భార్య అయేషా సిద్ధిఖీకి 2010లో విడాకులిచ్చాడు. ఇక అదే ఏడాది భారత టెన్నీస్ క్రీడాకారిణి సానియాను రెండో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ 2018లో కొడుకు ఇజాన్ పుట్టాడు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. తాజాగా సానియాకు విడాకులిచ్చి మూడోసారి సనాను వివాహం చేసుకున్నాడు.