- నీనా ప్రసాద్కు నృత్య కళానిధి
చెన్నై : మ్యూజిక్ అకాడమీకి చెందిన సంగీత కళానిధి అవార్డు 2024కు ప్రముఖ కర్ణాటక గాయకులు, వయొలిస్టు టిఎం కృష్ణ ఎంపికయ్యారు. మ్యూజిక్ అకాడమీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇటీవల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నృత్య కళానిధి అవార్డును డాక్టర్ నీనా ప్రసాద్కు అందజేయాలని కమిటీ నిర్ణయించింది. సంగీత కళా ఆచార్య అవార్డులను మృదంగ వాద్యకారుడు పరసాల రవి (వి.రవీంద్ర నాయర్), వయోలిస్టు గీతా రాజాకు అందజేయాలని నిర్ణయించింది. టిటికె అవార్డులను తిరువైయ్యారు బ్రదర్స్గా పేరుగాంచిన ఎస్. నరసింహన్, ఎస్ వెంకటేశన్లకు ప్రకటించారు. వయోలిస్టు హెచ్.కె. నరసింహమూర్తికి కూడా టిటికె అవార్డును ఇవ్వనున్నారు. మ్యూజికొలజిస్టు అవార్డును డాక్టర్ మార్గరేట్ బస్టిన్కు ప్రకటించారు. మ్యూజిక్ అకాడమీ 98వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది డిసెంబరు 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకూ జరిగే సమావేశాలు, కచేరీల్లో సంగీత కళానిధి అవార్డు, సంగీత కళా ఆచార్య, టిటికె అవార్డులు, మ్యూజికొలజిస్టు అవార్డులను ప్రదానం చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 3న జరిగే మ్యూజిక్ అకాడమీ 18వ వార్షిక నృత్యోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నృత్య కళానిధి అవార్డును ప్రదానం చేస్తారు.