న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సామ్సంగ్ తన టెలివిజన్లపై అద్బుత ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. నియో క్యూఎల్ఇడి4కె, 8కె, క్యుఎల్ఇడి, క్రిస్టిల్ 4కె యుహెచ్డి తదిలర 55 అంగుళాల పైబడిన పెద్ద టివిలపై క్యాష్బ్యాక్ను ప్రకటించింది. ఆయా టివిలపై రూ.1,24,999 విలువ గల గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్ఫోన్, రూ,37,990 విలువ చేసే వైర్లెస్ సౌండ్బార్లను ఉచితంగా ఇస్తోన్నట్లు పేర్కొంది.