‘కీడా కోలా’ నిర్మాతకు ఎస్పీ చరణ్ నోటిసులు

Feb 17,2024 09:48 #Film Industry, #telugu movies
sp charan notice to creeda kola movie

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) ద్వారా దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం స్వరాన్ని పునర్నిర్మించినందుకు ‘కీడా కోలా’ చిత్ర నిర్మాతతో పాటు సంగీత దర్శకుడు వివేక్ సాగర్ లకు కూడా ఎస్పీ కళ్యాణ్ చరణ్ లీగల్ నోటీసు పంపారు.  “ఆయన స్వరానికి మరణానంతర జీవితాన్ని అందించడానికి సాంకేతికతను, దాని పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించడం మేము నిజంగా ఇష్టపడుతున్నాము, కానీ అదే సాంకేతికతను మాకు తెలియకుండా, అనుమతి లేకుండా ఉపయోగించినప్పుడు కుటుంబం నిరుత్సాహపడుతుంది ” అని చరణ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. 2020లో కోవిడ్-19 సంబంధిత సమస్యల కారణంగా బాలసుబ్రహ్మణ్యం మరణించిన సంగతి విదితమే.

➡️