భయంతో పరుగెత్తి… బావిలో పడి…

Feb 15,2024 11:54 #Eluru district
Running in fear...falling into the well...

ప్రజాశక్తి-లింగపాలెం : ఏలూరు జిల్లా లింగపాలెం మండలం గోకవరం ఏరియాలో మంగళవారం అర్ధరాత్రి కోడిపందాలు స్తావరాలపైన ధర్మాజీగూడెం పోలీసులు దాడి చేశారు. దాడి సమయంలో అక్కడే వున్న వ్యక్తి పరిగెడుతూ బావిలో పడినట్లు సమాచారం. మృతుడు చింతలపూడి మండలం బాలవారిగూడెం రాయల రవిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎమ్ సుధాకర్, ధర్మాజీగూడెం ఎస్సై చెన్నారావు, పోలీస్ సిబ్బంది  వెలికితీస్తున్నారు.

➡️