పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన నగదు
ప్రజాశక్తి – రణస్థలం
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని పైడిభీమవరం వద్ద తనిఖీల్లో రూ.6.75 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన కాంట్రాక్టరు సతీష్ రెడ్డి అనపర్తి నుంచి కోటబొమ్మాళికి కారులో వెళ్తున్నారు. ఆ కారును పోలీసులు తనిఖీ చేయగా రూ.6.75 లక్షల నగదు ఉంది. ఇందుకు సంబంధించిన ఎటువంటి రశీదులు, ఆధారాలు చూపకపోవడంతో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జె.ఆర్ పురం ఎస్ఐ కె.గోవిందరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.