రూ.1.37 లక్షలు పట్టివేత

ఎన్నికల విధులు నిర్వహిస్తున్న

నిఖీల్లో నగదును స్వాధీనం చేసుకుంటున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌

ప్రజాశక్తి – వజ్రపుకొత్తూరు

ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ వాహనాలు తనిఖీలో భాగంగా రూ.1.37 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని బెండిగేటు వద్ద శుక్రవారం తనిఖీలు చేస్తుండగా విశాఖపట్నం నుంచి పలాసకు వస్తున్న కారును ఆపారు. అందులో తనిఖీలు చేయగా రూ.1.37 లక్షల నగదు ఉంది. ఈ డబ్బుకు సంబంధించి ఎటువంటి రశీదులు, ఆధారాలు చూపకపోవడంతో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని తహశీల్దార్‌ కార్యాలయానికి పంపినట్లు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ వనిత తెలిపారు. నగదును సీజ్‌ చేసి శ్రీకాకుళం ట్రెజరీ కార్యాలయానికి తరలించినట్లు తహశీల్దార్‌ సురేష్‌ చెప్పారు. దీనిపై వజ్రపుకొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.త

➡️