బిసిసిఐ కార్యదర్శి జై షారాజ్
కోట్: ఈ ఏడాది అమెరికా-వెస్టిండీస్ వేదికలుగా జరిగే టి20 ప్రపంచకప్కు భారత్ సారథిగా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఈమేరకు బిసిసిఐ కార్యదర్శి జై షా బుధవారం కీలక ప్రకటన చేశాడు. టి20 ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలోనే భారత జట్టు బరిలో దిగుతుందని వెల్లడించాడు. ఈసారి టీమిండియా కచ్చితంగా ప్రపంచ కప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గుజరాత్లోని రాజ్కోట్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2023 వన్డే ప్రపంచకప్లో 10 విజయాలు సాధించిన టీమిండియా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్స్లో ఓడినప్పటికీ క్రీడాభిమానుల మనసు గెలుచుకుందన్నారు. ఈ క్రమంలో 2024 జూన్లో జరగబోయే టి20 ప్రపంచకప్ ఫైనల్స్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ జెండా రెపరెపలాడుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.